Skip to main content

Posts

Featured Post

మళ్ళి ఖమ్మానికి మున్నేటి గండం?

రెండేళ్ల క్రితం ప్రారంభం నేటికీ సా...గుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణం ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 15 : జిల్లా కేంద్రం అయిన ఖమ్మం నగరానికి మళ్ళీ మున్నేటి గండం పొంచి ఉంది. ఖమ్మం కార్పొరేషన్, ఏదులాపురం పురపాలిక మధ్య ప్రవహిస్తున్న మున్నేరు కారణంగా.. భారీ వర్షాలు  వచ్చినప్పుడు వరదలు ముంచెత్తుతు న్నాయి. ఖమ్మంలో 10 ప్రాంతాలు, ఏదులాపురం పట్టణంలో 10 కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. 2024లో కురిసిన భారీ వర్షాలకు రెండు వైపులా వరద ఉదృతంగా ప్రవహించడంతో ఇళ్ళు మునిగిపోయాయి. బురద తొలగించడానికి వారం రోజు లకు పైనే పట్టింది. గత ఏడాది  భారీ వర్షా లకు మున్నేరు ముంచెత్తడంతో పలు కాలనీలు జలమయమ య్యాయి. సమస్యను పరిష్కరించడానికి రెండు వైపులా 17 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ (కాంక్రీట్ కరకట్ట) నిర్మిం చడానికి 2024 జూన్ లో పనులు మొదలయ్యాయి. ఎగువన దానవాయిగూడెం నుంచి దిగువన ప్రకాశ్ నగర్ వరకు నదికి రెండు వైపులా 8.50 కి. మీ. చొప్పున మొత్తం 17 కి. మీ. పొడవున కరకట్టలు నిర్మించాల్సి ఉంది. నిర్మాణానికి రూ.6.90 కోట్లు వ్యయమవుతోంది. వీటిని 2025 డిసెంబరులోపే పూర్తి చేయాల్సి ఉండగా భూసేకరణ పూర్తికాక ఆలస్యమవుతోంది. ప్రస్తు...
Recent posts

అటు బదిలీ.. ఇటు కొనసాగింపు వ్యవసాయ మార్కెట్‌లో సెక్రటరీ బదిలీ లొల్లి

ఓ నేత స్నేహ హస్తంపై భారీ ఆరోపణలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ లో సెక్రటరీ బదిలీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ చేత్తో బదిలీ ఆర్డర్ ఇచ్చి మరో వైపు ఆన్ డ్యూటి(ఓడి) ఉత్తర్వులు ఇవ్వడంపై రాజకీయ, వ్యాపార, మార్కెట్ వర్గాల్లో తీవ్ర విస్మయం కలిగిస్తోంది. నిత్యం అవినీతి ఆరోపణలతో సహవాసం చేస్తున్న సదరు సెక్రటరీకి ప్రభుత్వం ఏకంగా ఐదోసారి పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఏ ప్రభుత్వ అధికారికైనా బదిలీలు, ఒకట్రెండు సార్లు పొడిగింపులు సహజం. కానీ, ప్రస్తుత సెక్రటరీకి ప్రభుత్వం ఇప్పటికి ఏకంగా ఐదుసార్లు పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడం మార్కెట్ వర్గాలతో పాటు ఉన్నతాధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇంతలా బదిలీలను అడ్డుకుంటూ, పదే పదే పొడిగింపులు తెచ్చుకుంటున్న ఆ సెక్రటరీ వెనుక ఉన్న అంతర్యం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. ఆయన తీరుపై రైతులు, రైతు సంఘాల నుంచి తీవ్ర స్థాయి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా సెక్రటరీ పని తీరుపై మార్కెట్లో జరిగే ఆర్డీలు, జీరో దందాలపై (పన్ను ఎగవేత వ్యాపారం) అధికారి కనీస దృష్టి సారించడం లేదనే ఆరోప...

చీరలు.. మామిడి పచ్చడి.. సీజనల్ పాలి''ట్రిక్స్'

  ఖమ్మం మున్సి''పల్స్'' కార్పొరేషన్ రసవత్తరం ఖమ్మం: "ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందట" చందంగా ఉంది జిల్లా కేంద్రం అయిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్  లోని రాజకీయ నాయకుల పరిస్థితి. ఇక్కడి పాలకవర్గం గడవు ఈ నెల మొదటి వారంతో ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. ఎన్నికలు ఎప్పుడనేది స్పష్టత లేదు. హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్ లతో పాటు జరుగుతాయనేది ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారడంతో రెండు సార్లు బిఆర్ఎస్ మేయర్లు పని చేశారు. మొట్ట మొదటి మేయర్ గా డాక్టర్ పాపాలాల్ వ్యవహరించారు. ఆ తర్వాత మేయర్ గా నీరజ పని చేశారు. ఆమె కారు పార్టీ మేయర్ గా బాధ్యతలు చేపట్టినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆమెనే కొనసాగించారు. పదేళ్ల పాటు టి(బి)ఆర్ఎస్ పాలకులకు ఎదురొడ్డి నిలిచిన కాంగ్రెస్ నాయకులు కార్పోరేటర్లుగా పార్టీ అవకాశం కల్పిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన నేతలు, ప్రభుత్వం వచ్చిన తర్వాత చేరిన ఇతర పార్టీ నేతలు సైతం కార్పొరేటర్ టికెట్లు ఆశిస్తున్నారు. కార్పొరేషన్ లో మొత్...

ఇది ఖాకీ (అ)న్యాయం! ఖమ్మంలో సీఐ అరాచకపర్వం

వివాహితకు వల, సీఐ పై కేసు నమోదు ఖమ్మం : న్యాయం కోసం వచ్చిన ఒక వివాహితను ప్రేమ పేరుతో మోసం చేసినట్లు ఓ ఇన్ స్పెక్టర్ (సీఐ) పై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని, ఆ తర్వాత బలవంతంగా టాబ్లెట్లు మింగించడంతో అబార్షన్ అయిందని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమెను వేధించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2023లో ఆ మహిళ తన భర్త తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇన్ స్పెక్టర్ రాజు నాయక్  ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడటం ప్రారంభించాడు. క్రమంగా నమ్మించి, లొంగదీసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఇటీవల ఖమ్మం నగరంలో పోలీసులు కేసు నమోదు చేయగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.  మరొక మహిళా తో కూడా ఎఫ్ఫైర్ నడిపానట్లు తన గొడవ తరవాత తెలిసిందని ప్రస్తుత బాధితురాలు తెలిపింది. బాధ్యత గల పోలీస్ సీఐ భార్య ఉండగా ఇద్దరు మహిళలకు మాయ మాటలు చెప్పి మోసం చేసినట్లు ఆరోపించింది.  సదరు సీఐ అరాచకపర్వంపై విచారణ చేయాలని డిమాండ్ లు వస్తున్నాయి. మహిళా పి.ఎస్. లో ఎస్ .హెచ్ .ఓ గా ఉన్న సమయంలో ప్రైవేటు సై...

మంత్రి తుమ్మల.. పైలాన్ నిర్మాణంపై సీరియస్, తొలగింపు

ఖమ్మం : రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, మచ్చలేని ఇమేజ్ ఉన్న నాయకులను సైతం ఒక్కోసారి అనుచరుల అత్యుత్సాహం వివాదాల్లోకి నెడుతుంది. ఇందుకు ఖమ్మం నగరం వేదికైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల మంత్రి రాజకీయ ప్రస్థానానికి చిహ్నంగా కొందరు ముఖ్య నాయకులు తలపెట్టిన ‘పైలాన్’ (స్తూపం) నిర్మాణం.. చివరకు ఆయనకే మచ్చ తెచ్చేలా మారడంతో అమాత్యుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన మంత్రి తుమ్మల తక్షణమే ఆ పనులను నిలిపివేయించి వివాదానికి తెరదించారు. స్థానిక లకారం ట్యాంక్ బండ్ జంక్షన్ లో దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం వెనుక భాగంలో ఒక పైలాన్ నిర్మాణాన్ని కొంతమంది అధికార పార్టీ నాయకులు రాత్రి కి రాత్రి చొరవ చూపారు. ఈ నిర్మాణానికి అడ్డుగా ఉందనే సాకుతో అక్కడ ఎంతో కాలంగా ఉన్న ఒక పచ్చని చెట్టును సైతం నిర్దాక్షిణ్యంగా బలితీసుకున్నారు. మున్సిపల్ అధికారులపై రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి, నిబంధనలకు విరుద్ధంగా ఈ పనుల్లో వేగం పెంచారు. బుధవారం పైలాన్ నిర్మాణ భూమి పూజ కూడా చేశారు. యువ నేత, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అయితే, పీవీ లాంటి మహోన్నత వ్యక్తి విగ్...

చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్ ఇక లేరు.. పిల్లలమర్రి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి. పదేళ్ల బి.ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ కు అండగా. పదవి రాకుండానే అనంతలోకాలకు

కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు పొంగులేటి, తుమ్మల దిగ్బ్రాంతి ఖమ్మం : మహమ్మద్ జావీద్ .. కరడుగట్టిన కాంగ్రెస్ వాది. మైనార్టీ నాయకుడు. అతని మోము పై ఎపుడు చిరునవ్వే ఉంటుంది. పదేళ్ల టీ(బి).ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ జెండా విడువలేదు. అంతేగాక పార్టీ ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ చే జారింది. పార్టీ సమీకరణాల దృష్ట్యా తుమ్మల నాగేశ్వర రావు ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో మంత్రి అయ్యారు. ఎప్పుడు చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్(56) ఇక లేరనే విషయం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపింది. ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత మహమ్మద్ జావీద్ ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట పిల్లలమర్రి శివారులో ఆయన ఒక్కరే ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి అతివేగంతో డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. జావీద్ మృతితో ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కష్ట కాల...

ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్ సోషల్ మీడియ పోస్ట్ కలకలం

నిజామాబాద్: జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి.. గ్రూప్-2 అధికారిగా ఎక్సైజ్ శాఖలో చేరి, డిప్యూటీ కమిషనర్ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ లో పని చేస్తుండగా ఆయన గతంలో ఖమ్మం తో పాటు పలు ప్రాంతాల్లో ఆయన పని చేశారు. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లిన మేథాశక్తి గల ఉన్నతాధికారి. సోషల్ మీడియా వేదికగా ఈ అధికారి అత్యంత ఆవేదనతో విడుదల చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కమిషనర్ కార్యాలయానికి వెళ్లినపుడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను తట్టుకోలేక ఉద్యోగాన్నే వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డారంటే పరిస్థితిని అవగతం చేసుకోవచ్చని ఎస్.ఎం లో చర్చ జరుగుతోంది. డిప్యూటీ కమిషనర్ అయినటువంటి తనను కమిషనర్ దుర్భాషలాడారని, వాటిని తట్టుకోలేక కిందపడి పోగా, స్నేహితులు ఆసుపత్రికి తరలించారని సోమిరెడ్డి చెబుతున్నారు. సోమిరెడ్డిని దూషించిన కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని, అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఎక్సైజ్ ఉద్యోగుల సంఘం జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఘటనపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలని కూడా ప్రభుత్వాన్ని కోరింది. సోషల్ మీడియాలో బాధి...