పోలీస్ దాడుల్లో బహిర్గతం ఖమ్మం, : ఆశీర్వాద్ సంస్థ పేరుతో నకిలీ పైపులు విక్రయిస్తున్న ఖమ్మం పీఎస్ ఆర్ రోడ్డులోని జగదాంబ ఎంటర్ప్రైజెస్ దుకాణంపై గత ఫిబ్రవరి 25న ఖమ్మం మూడో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. రూ.40వేల పైపులు, జాయింట్లు, ఎల్బీలు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం ప్రశాంతినగర్లోని ఓ వ్యాపారి నిర్వహిస్తున్న శానిటరీ సామగ్రి గోదాములో నకిలీ విద్యుత్తు వైర్ల భారీ నిల్వలను పోలీసులు ఆగస్టు 8న పట్టుకున్నారు. నకిలీ వైర్లను అట్టల్లో ప్యాకింగ్ చేస్తున్నాడు. ఇలా తయారుచేసిన విద్యుత్ వైర్లను ఆయన నగరంలోని కొన్ని దుకాణాలకు సరఫరా చేయడంతో పాటు ఎలక్ట్రిషన్లకు కమిషన్ ఇచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. రాజ స్థాన్ వ్యాపారి ఈ దందా నిర్వహిస్తు న్నట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రల సరిహద్దు తెలంగాణ-ఏపీ సరిహద్దులో ఉన్న ఖమ్మంలో కొందరు వ్యాపారులు సిండికేట్ గా మారి మార్కెట్ ను శాసిస్తు న్నారు. నకిలీ వస్తువులు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. భవన నిర్మాణంలో సిమెంటు నుంచి విద్యుత్తు సామగ్రి వరకు ప్రతీది ప్రధానమైనదే. నాణ్యతలేని, నకిలీ వస్తువుల కారణంగా సంభవించే ప్రమాదాలతో భవన యజమానులు, అం...
ఖమ్మం : రాష్ట్రంలోనే మంచి పేరు ఉన్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పని తీరు రోజు రోజుకు మసక బారుతోంది. పాలకవర్గం గడువు ముగియడంతో కొందరు అధికారులు జూలు విదుల్చుతున్నారు. అక్రమాలకు తేర లేపారు. ఇటీవల డీజిల్, పెట్రోల్ కుంభకోణం మరువకముందే తాజాగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్ద అక్రమ వసూళ్లు వెలుగు చూసింది. ఓ యువ కార్పొరేటర్ పై ప్రత్యర్థుల తో కలిసి మెప్మా సిబ్బంది ఒకరు ఫిర్యాదు చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. కమిషనర్ పేషీ సీసీ చేతివాటం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మొదటి విడత ఇండ్ల పంపిణీ ప్రక్రియ పూర్తయి రెండవ విడత లబ్దిదారుల జాబితాను సిద్ధం చేయించింది. అయితే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో అర్హుల గుర్తింపు ప్రక్రియను వార్డు ఆఫీసర్లకు అప్పగించారు. ఇదే అదునుగా భావించిన వారు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే చేతులు తడపాల్సిందే అంటూ తమదైన పద్ధతిలో వసూళ్ల పర్వానికి తెర లేపారు. ఒక ఇంటికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వసూళ్లకు పాల్పడ్డారు. ఓ వార్డు ఆఫీసర్ గా ఉన్న కమిషనర్ పేషీ సీసీ చేతివాటం...