పోలీస్ దాడుల్లో బహిర్గతం
ఖమ్మం, :
ఆశీర్వాద్ సంస్థ పేరుతో నకిలీ పైపులు విక్రయిస్తున్న ఖమ్మం పీఎస్ ఆర్ రోడ్డులోని జగదాంబ ఎంటర్ప్రైజెస్ దుకాణంపై గత ఫిబ్రవరి 25న ఖమ్మం మూడో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. రూ.40వేల పైపులు, జాయింట్లు, ఎల్బీలు స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం ప్రశాంతినగర్లోని ఓ వ్యాపారి నిర్వహిస్తున్న శానిటరీ సామగ్రి గోదాములో నకిలీ విద్యుత్తు వైర్ల భారీ నిల్వలను పోలీసులు ఆగస్టు 8న పట్టుకున్నారు. నకిలీ వైర్లను అట్టల్లో ప్యాకింగ్ చేస్తున్నాడు. ఇలా తయారుచేసిన విద్యుత్ వైర్లను ఆయన నగరంలోని కొన్ని దుకాణాలకు సరఫరా చేయడంతో పాటు ఎలక్ట్రిషన్లకు కమిషన్ ఇచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. రాజ స్థాన్ వ్యాపారి ఈ దందా నిర్వహిస్తు న్నట్లు పోలీసులు గుర్తించారు.
తెలుగు రాష్ట్రల సరిహద్దు
తెలంగాణ-ఏపీ సరిహద్దులో ఉన్న ఖమ్మంలో కొందరు వ్యాపారులు సిండికేట్ గా మారి మార్కెట్ ను శాసిస్తు న్నారు. నకిలీ వస్తువులు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. భవన నిర్మాణంలో సిమెంటు నుంచి విద్యుత్తు సామగ్రి వరకు ప్రతీది ప్రధానమైనదే. నాణ్యతలేని, నకిలీ వస్తువుల కారణంగా సంభవించే ప్రమాదాలతో భవన యజమానులు, అందులో నివ సించే వారు ఆర్థికంగా నష్టపో తున్నారు. ప్రముఖ సంస్థల పేరుతో అంటగట్టే నకిలీ వస్తు వుల(డూప్లికేట్ ప్రొడక్ట్స్) కు ఖమ్మం నగరం అడ్డాగా మారిందనే విషయం పోలీసులకు పట్టుబడుతున్న సంఘటన తెలియజేస్తున్నాయి. ప్రధాన బ్రాండ్ల పేరుతో కొందరు వ్యాపారులు యదేచ్ఛగా మోసాలకు పాల్పడు తున్నారు. ఎలక్ట్రికల్, భవన నిర్మాణ రంగంలో సమస్య తీవ్రంగా ఉంది. బ్రాండెడ్ కంపెనీల పేరిట నాసిరకం వైర్లు స్విచ్ బోర్డులు ఇతర విద్యుత్తు ఉపకరణాలు, వివిధ రకాల పైపులు, శానిటరీ సామగ్రి తదితరాలు ఖమ్మం మార్కెట్లో పోటెత్తుతు న్నాయి. దిల్లీ, రాజస్థాన్ ల నుంచి పెద్ద మొత్తంలో దిగు మతి అవుతున్నట్లు సమాచారం. ఏ మాత్రం తేడా గుర్తించటానికి వీల్లేని విధంగా ఉండటంతో వినియోగదారులు సులువుగా మోసపోతున్నారు. నాసిరకం వైర్లు, ఉపకరణాలతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి ప్రమా దాలు జరుగుతున్నాయి. గోడ లోపల పైపులు నాసిరకంగా ఉండి నీరు లీకై భవనాలు దెబ్బతింటున్నాయి. దీర్ఘకాలం పని చేయాల్సిన శానిటరీ సామగ్రి నెలల వ్యవధిలో పాడై పోతున్నాయి. బ్రాండ్ల పేరుతో ఇవి ఉండటంతో విని యోగదారులు లోపం గుర్తించ లేకపోతున్నారు. స్వీయ నిర్ల క్ష్యమే ఇందుకు కారణమన్న భావనంలో ఉండిపోతున్నారు.
ఊరి బయట భారీ గోదాములు..
అక్రమ వ్యాపారుల దుకాణాలు ఖమ్మం నగర శివార్లలో ఉంటున్నాయి. తక్కువ అద్దెతో లభించే ప్రాంతాల్లో అక్కడ ఏర్పాటు చేస్తు న్నారు. ఎవరి గోదాము ఎక్కడ ఉన్నదీ ఎవరికీ తెలియదు. వాటిల్లో ఏం ఉంచు తున్నారు? ఎక్కడి నుంచి తెస్తున్నారో అర్థం కావడం లేదు. కొన్ని దుకాణాల్లో బిల్లు లేకుండా రూ. కోట్లలో వ్యాపారం సాగుతున్నా అధికారులు అటుగా చూడటం లేదన్న విమర్శలున్నాయి. నిఘా లేకపోవడంతో వ్యాపారులు యథేచ్ఛగా అక్రమాలు సాగిస్తున్నారు. ఇటీవల దాడుల ఘటనల్లో నష్టపోతున్న ఆసలు (ఒరిజినల్) బ్రాండెడ్ సంస్థ వారు చేసినవే ఎక్కువగా ఉండటం గమనార్హం.


Comments
Post a Comment