వైరా: ఖమ్మం జిల్లాలోని వైరా పుర పాలక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలో వెన్నుపోట్లపై ఫలితాల అనంతరం విస్తృతంగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో మూడు కాంగ్రెస్ వర్గాలు వెన్నుపోటుకు కత్తులు దూసుకున్నాయి. అయితే 3 వార్డుల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు ఈ వెన్నుపోట్ల కత్తుల గాయాల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. వైరా మున్సిపాలిటీలోని 6, 7, 9, 10, 11, 12, 15 వార్డుల్లో వెన్నుపోటు రాజకీయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కాపా చంద్రకళ, 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పణితి సైదులు, 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్ల సంతోష్, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు త్రివేణి, 11 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొల్లి రమేష్, 12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని మిట్టపల్లి కృష్ణవేణి, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రాంపూడి రాజ్యలక్ష్మి పై వెన్నుపోట్లు రాజకీయాలు జరిగాయని ప్రచారం జరుగుతుంది. అయితే వెన్నుపోట్ల రాజకీయాల నుంచి 6, 7, 9 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థుల సురక్షితంగా మంచి మెజార్టీతో బయటపడ్డారు. 10, 11, 12, 15 వార్డులోని కాంగ్రెస్ అభ్యర్థులు కట్టప్పల వల్ల ఓటమిని చవిచూశారు. 6,9,10,11,15 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ బలమైన వర్గం ప్రయత్నించిందని ప్రచారం జరుగుతోంది . అయితే వారి ప్రయత్నాలు 10, 11, 15 వార్డుల్లో సఫలీకృతమయ్యాయి. 6,9 వార్డుల్లో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. 9వ వార్డులో ఆ వర్గం చేసిన వ్యతిరేకతకు ప్రతిగా 12వ వార్డులో ఓ మహిళ కేంద్ర స్థాయి నేత వర్గం వెన్నుపోటు పొడిచిందని ప్రచారం జరుగుతుంది. 7వ వార్డులోని కాంగ్రెస్ అభ్యర్థి పై అక్కడ టికెట్ ఆశించి భంగపడిన ప్రభుత్వం లోని కీలక స్థానంలో ఉన్న వర్గం వారు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కాంగ్రెస్ వెన్నుపోటు రాజకీయాలు వైరాలో సంచలనంగా మారాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం మున్సిపల్ చైర్ పర్సన్ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందా, లేదా ఇలాంటి వెన్నుపోట్ల వ్యవహారంతో ఇరుకున పడుతుందా తెలియాలంటే చైర్ పర్సన్ ఎన్నిక రోజు తేలనుంది.
ఖమ్మం: జిల్లాలో యూరియా పంపిణీ ఫర్టిలైజర్ యాప్ ద్వారా విజయవంతంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జనవరి, 29వ తేదీ నుండి యూరియా పంపిణి యాప్ ద్వారా జరుగుతుందని, ఈ వారం రోజుల్లో 25252 మంది రైతులు 108721 యూరియా సంచులను యాప్ ద్వారా బుక్ చేసుకున్నారని, 87350 సంచులను కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. రైతులు ఈ యాప్ ద్వారా జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియాను వారి యొక్క పంట రకమును బట్టి, వారికున్న విస్తీర్ణాన్ని బట్టి జిల్లాలో ఏ డీలర్ వద్ద అయినా, ఏ సొసైటీలో అయినా అందుబాటులో ఉన్న యూరియాను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల లోపు ఆ రైతు బుక్ చేసుకున్న డీలర్ దగ్గరికి వెళ్లి కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఏదైనా పరిస్థితులలో 24 గంటల లోపు యూరియాను తీసుకోనట్లయితే ఆ యొక్క బుకింగ్ రద్దు అవుతుందని, మళ్లీ రైతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇందులో పట్టాదారులు, పట్టా పుస్తకాలు లేని వారు, కౌలు రైతులు యూరియాను బుక్ చేసుకునే వెసులుబాటు ఉందని కలెక్టర్ తెలిపారు. కౌలుదారులు అయితే వాళ్ళు ఎవరి దగ్గర అయితే ...
Comments
Post a Comment