ప్రమాదాలు 15, మృతులు 6, గాయాలు 25
వైరా/ఖమ్మం : హడావుడిగా పనులు.. ప్రారంభానికి ముందే రాక పోకలు.. ప్లాజాలు తెరవడం.. వాహనదారుల ముక్కు పిండి టోల్ వసూలు చేయడం.. ఇదీ ఎన్ హెచ్ ఏ ఐ అధి కారుల తీరు. రాబడిపైనున్న ధ్యాస రహదారి భద్రతపై కొరవడటంతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపంగా మారుతున్నాయి. నగరంలో ప్రమాదాలు జరు గుతున్నాయంటూ పనులు పూర్తికాక ముందే.. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై రాకపోకలకు అనుమతించడం దుర్ఘటనలకు కారణమవుతోంది. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 162.50 కి. మీ. మేర నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ (ఎన్ హెచ్-365 బీజీ) పై కొన్ని నెలల క్రితం వైరా నుంచి రాకపోకలు ప్రారంభించి టోల్ వసూలు చేస్తు న్నారు. తాజాగా ఖమ్మం నగరం మీదుగా వాహనాలు నడుస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ హైవేలో 15 దుర్ఘట నలు జరిగాయి. తల్లాడలో ఒక కాని స్టేబుల్, వేంసూర్ లో లారీ, ఉల్లిపా యల లోడు ఢీకొన్న ఘటనలో క్లీనర్, కల్లూరు మండలం లింగాలలో రేయి లింగ్ ను బైక్ ఢీకొనడంతో ఏపీ వాసులు ఇద్దరు మరణించారు. తాజాగా మరో ఇద్దరు మృతి చెందారు. 25 మంది వరకు క్షతగాత్రులయ్యారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై వైరా మండలం సోమవారం వద్ద చాన్నాళ్లుగా అనుమతిస్తున్నారు అయితే ధoసలాపురం బ్రిడ్జి ఇటీవల పూర్తయిన ఇంకా ఎగ్జిట్ వద్ద ఇరువైపులా అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. అయినప్పటికీ హడావుడిగా నాలుగు రోజుల క్రితం రాకపోకలు అనుమతించారు. ఈ విషయమై విస్తృత ప్రచారం జరగడంతో వాహనదారులు హైవేను ఎంచుకుంటున్నారు కాగా హైదరాబాద్ వైపు వెళ్లేందుకు ఎక్కాల్సిన అప్రోచ్ రోడ్డును పనులు దృశ్య అధికారులు మూసేశారు. ఇదే సమయాన దేవరపల్లి వెళ్లే మార్గంలో హైవే ఎక్కి రోడ్డును మూసివేయలేదు. అంతేగాక హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదు. దీంతో హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన వారు కూడా దేవరపల్లి వైపు ఉన్న రోడ్డుపైకి ఎక్కి రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలను అంచనా వేయకపోవడం గురువారం నాటి ప్రమాదం జరిగిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరగగానే అధికారులు హైదరాబాద్ వైపు ఎంట్రీ పాయింట్ ను వదిలేయడం గమనార్హం. దేవరపల్లి ఎంట్రన్స్ హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చే ఎగ్జిట్ దారుల్లో ఎలాంటి సైన్ బోర్డులు లేవు
హైదరాబాద్ కు దారేది?
ఖమ్మం బోనకల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లడానికి గ్రీన్ ఫీల్డ్ ఎక్కే ర్యాంపు ప్రవేశం దారి నిర్మాణం పూర్తి కాలేదు. దేవరపల్లి నుంచి వచ్చిన వాహనాలు ఖమ్మం నగరంలోకి వెళ్లేందుకు నిష్క్రమణ దారి లేకపోవడంతో వాహనాలు తికమక పడుతున్నారు. ఈ దారి మూసివేయడంతోనే గురువారం హైదరాబాద్ వెళ్లడానికి మరో దారిలో ఎదురెళ్లిన కారు-డీసీఎం ఢీకొనడంతో తల్లి, కుమారుడు మరణించారు. తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
అధికారులు ఏమంటున్నారంటే
హై వే అంశంపై ఎన్ హెచ్ ఏ ఐ పిడి దివ్య మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో భారీ లోడు వాహనాలు రద్దీతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రీన్ ఫీల్డ్ పై రాకపోకలకు అనుమతించాం. ర్యాంపులు నిర్మాణం పూర్తి కాలేదని ఖమ్మంలో రాకపోకలు నిలిపివేశాం. వెంకటగిరి, వైరా వద్ద మాత్రమే ప్రవేశ, నిష్క్రమణ దారులు తెరిచాం. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments
Post a Comment