ప్రమాదాలు 15, మృతులు 6, గాయాలు 25 వైరా/ఖమ్మం : హడావుడిగా పనులు.. ప్రారంభానికి ముందే రాక పోకలు.. ప్లాజాలు తెరవడం.. వాహనదారుల ముక్కు పిండి టోల్ వసూలు చేయడం.. ఇదీ ఎన్ హెచ్ ఏ ఐ అధి కారుల తీరు. రాబడిపైనున్న ధ్యాస రహదారి భద్రతపై కొరవడటంతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపంగా మారుతున్నాయి. నగరంలో ప్రమాదాలు జరు గుతున్నాయంటూ పనులు పూర్తికాక ముందే.. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై రాకపోకలకు అనుమతించడం దుర్ఘటనలకు కారణమవుతోంది. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 162.50 కి. మీ. మేర నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ (ఎన్ హెచ్-365 బీజీ) పై కొన్ని నెలల క్రితం వైరా నుంచి రాకపోకలు ప్రారంభించి టోల్ వసూలు చేస్తు న్నారు. తాజాగా ఖమ్మం నగరం మీదుగా వాహనాలు నడుస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ హైవేలో 15 దుర్ఘట నలు జరిగాయి. తల్లాడలో ఒక కాని స్టేబుల్, వేంసూర్ లో లారీ, ఉల్లిపా యల లోడు ఢీకొన్న ఘటనలో క్లీనర్, కల్లూరు మండలం లింగాలలో రేయి లింగ్ ను బైక్ ఢీకొనడంతో ఏపీ వాసులు ఇద్దరు మరణించారు. తాజాగా మరో ఇద్దరు మృతి చెందారు. 25 మంది వరకు క్షతగాత్రులయ్యారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిప...