Skip to main content

Posts

Showing posts with the label Khammam

ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్ సోషల్ మీడియ పోస్ట్ కలకలం

నిజామాబాద్: జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి.. గ్రూప్-2 అధికారిగా ఎక్సైజ్ శాఖలో చేరి, డిప్యూటీ కమిషనర్ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ లో పని చేస్తుండగా ఆయన గతంలో ఖమ్మం తో పాటు పలు ప్రాంతాల్లో ఆయన పని చేశారు. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లిన మేథాశక్తి గల ఉన్నతాధికారి. సోషల్ మీడియా వేదికగా ఈ అధికారి అత్యంత ఆవేదనతో విడుదల చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కమిషనర్ కార్యాలయానికి వెళ్లినపుడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను తట్టుకోలేక ఉద్యోగాన్నే వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డారంటే పరిస్థితిని అవగతం చేసుకోవచ్చని ఎస్.ఎం లో చర్చ జరుగుతోంది. డిప్యూటీ కమిషనర్ అయినటువంటి తనను కమిషనర్ దుర్భాషలాడారని, వాటిని తట్టుకోలేక కిందపడి పోగా, స్నేహితులు ఆసుపత్రికి తరలించారని సోమిరెడ్డి చెబుతున్నారు. సోమిరెడ్డిని దూషించిన కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని, అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఎక్సైజ్ ఉద్యోగుల సంఘం జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఘటనపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలని కూడా ప్రభుత్వాన్ని కోరింది. సోషల్ మీడియాలో బాధి...

ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం: జిల్లాలో యూరియా పంపిణీ ఫర్టిలైజర్ యాప్ ద్వారా విజయవంతంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జనవరి, 29వ తేదీ నుండి  యూరియా పంపిణి యాప్ ద్వారా జరుగుతుందని, ఈ వారం రోజుల్లో 25252 మంది రైతులు 108721 యూరియా సంచులను యాప్  ద్వారా బుక్ చేసుకున్నారని, 87350 సంచులను కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. రైతులు ఈ యాప్ ద్వారా జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియాను వారి యొక్క పంట రకమును బట్టి, వారికున్న విస్తీర్ణాన్ని బట్టి జిల్లాలో ఏ డీలర్ వద్ద అయినా, ఏ సొసైటీలో అయినా అందుబాటులో ఉన్న యూరియాను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల లోపు ఆ రైతు బుక్ చేసుకున్న డీలర్ దగ్గరికి వెళ్లి కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఏదైనా పరిస్థితులలో 24 గంటల లోపు యూరియాను తీసుకోనట్లయితే ఆ యొక్క బుకింగ్ రద్దు అవుతుందని, మళ్లీ రైతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇందులో పట్టాదారులు, పట్టా పుస్తకాలు లేని వారు, కౌలు రైతులు యూరియాను బుక్ చేసుకునే వెసులుబాటు ఉందని కలెక్టర్ తెలిపారు.  కౌలుదారులు అయితే వాళ్ళు ఎవరి దగ్గర అయితే ...