Skip to main content

Posts

Showing posts with the label telangana tummala

మంత్రి తుమ్మల.. పైలాన్ నిర్మాణంపై సీరియస్, తొలగింపు

ఖమ్మం : రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, మచ్చలేని ఇమేజ్ ఉన్న నాయకులను సైతం ఒక్కోసారి అనుచరుల అత్యుత్సాహం వివాదాల్లోకి నెడుతుంది. ఇందుకు ఖమ్మం నగరం వేదికైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల మంత్రి రాజకీయ ప్రస్థానానికి చిహ్నంగా కొందరు ముఖ్య నాయకులు తలపెట్టిన ‘పైలాన్’ (స్తూపం) నిర్మాణం.. చివరకు ఆయనకే మచ్చ తెచ్చేలా మారడంతో అమాత్యుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన మంత్రి తుమ్మల తక్షణమే ఆ పనులను నిలిపివేయించి వివాదానికి తెరదించారు. స్థానిక లకారం ట్యాంక్ బండ్ జంక్షన్ లో దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం వెనుక భాగంలో ఒక పైలాన్ నిర్మాణాన్ని కొంతమంది అధికార పార్టీ నాయకులు రాత్రి కి రాత్రి చొరవ చూపారు. ఈ నిర్మాణానికి అడ్డుగా ఉందనే సాకుతో అక్కడ ఎంతో కాలంగా ఉన్న ఒక పచ్చని చెట్టును సైతం నిర్దాక్షిణ్యంగా బలితీసుకున్నారు. మున్సిపల్ అధికారులపై రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి, నిబంధనలకు విరుద్ధంగా ఈ పనుల్లో వేగం పెంచారు. బుధవారం పైలాన్ నిర్మాణ భూమి పూజ కూడా చేశారు. యువ నేత, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అయితే, పీవీ లాంటి మహోన్నత వ్యక్తి విగ్...