జిల్లా గ్రంథాలయం అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి అభివృద్ధి పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
జిల్లా గ్రంథాలయం అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి నూతన భవనం నిర్మాణం నాణ్యతతో పూర్తి చేయాలి అభివృద్ధి పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఖమ్మం : జిల్లా గ్రంథాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, పాఠకులకు, విద్యార్దులకు అవసరమైన వసతుల కల్పనపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం పెవిలియన్ గ్రౌండ్ పక్కన ఉన్న జిల్లా గ్రంథాలయం లో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైబ్రరీ ఆవరణంలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు భవనం, చుట్టూ ప్రహరీగోడ, టాయిలెట్ల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ శ్రీజ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నిర్మితమవుతున్న నూతన రెండు అంతస్ధుల భవనంతో పాటు విద్యార్ధులకు, అభ్యర్ధులు, పాఠకులకు కావాల్సిన వసతుల ఏర్పాట్లను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనుసంధానంగా ప్రహారీ గోడ, గేట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గ్రంథాలయంలోని రీడింగ్ రూమ్ లలో తిరుగుతూ కావాల్సిన వసతుల అవసరాలను కలెక్టర్ గుర్తించారు. అక్కడ ఉన్న పాఠకులతో, పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులతో ముచ్చటించ...